నితిన్ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అంధాదున్’ తెలుగు రీమేక్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఠాగూర్ మధు సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, చెల్లెలు నిఖితా రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తుండటం విశేషం. ఈ మూవీలో ఒరిజినల్ వర్షన్లో రాధికా ఆప్టే పోషించిన రోల్ నభా నటేష్ చేయనుందని, అలాగే పవర్ఫుల్ టబు రోల్లో తమన్నా కనిపించనుందని తెలిపారు. ‘అంధాదున్’ మూవీలో టబు పోషించిన పాత్ర సినిమా విజయంలో కీలకం అయింది. ఈ సినిమాకు విలన్ తమన్నానే. అయితే సినిమాలు లేకపోవడంతో తమన్నా ఈ నిర్ణయం తీసుకుందా… ఛాలెంజింగ్ గా ఉంటుందని ప్రయత్నిస్తుందా తెలియదు. కానీ మొత్తానికి ఈ సినిమాలో నటించడానికి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆ రోల్ కోసం ఇలియానా, శ్రీయ, నయనతార, రమ్యకృష్ణ లాంటి హీరోయిన్ల పేర్లు పరిశీలించి చివరకు తమన్నాను సెలక్ట్ చేశారు మేకర్స్. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్ర కోసం తమన్నాకు ఏకంగా కోటిన్నర ముట్టజెప్తున్నారట నిర్మాతలు.
previous post
బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇప్పుడు స్పందించను : మంత్రి తలసాని