telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జబర్దస్త్ లో వీళ్ళ రీఎంట్రీ… ఇక వాళ్ళు అవుట్… !

Jabardasth

బుల్లితెర కామెడీ షో “జబర్దస్త్” ఎంతగా పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కొంతమంది ఈ షోపై విమర్శలు గుప్పించినా… చాలామంది ఈ షోను చూస్తూ సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. షో ఇంతగా పాపులర్ అవ్వడానికి జడ్జీలతో పాటు యాంకర్స్ కూడా కారణం అని చెప్పొచ్చు. అనసూయ, రష్మీ ఈ షోకు ప్రత్యేక ఆకర్షణ. ఈ షోతో ఈ ఇద్దరు ముద్దుగుమ్మల క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఇటు బుల్లితెరపై అలరిస్తూనే, మరోవైపు వెండితెరపై కూడా మెరుస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ ప్రోగ్రాంకు నాగబాబు, రోజా జడ్జిలుగా వ్యవహరించారు. కాగా ఇప్పుడు ఈ షో నుంచి తాను తప్పుకుంటున్నట్టుగా నాగబాబు స్పష్టం చేశారు. ఈ షోతో సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను తదితరులు కమెడియన్లుగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. కాగా ఈ కార్యక్రమానికే మూల స్తంభాలుగా మారిన హైపర్ అది, చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్ టీమ్స్ ఈ షో నుంచి బయటకు వెళ్లిపోవడం ఖాయమైందనే వార్తలు విన్పిస్తున్నాయి. దీంతో జబర్ధస్త్‌లోకి మళ్లీ పాత టీమ్ సభ్యులను ఆహ్వానించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు టాక్. జబర్ధస్త్ ద్వారా క్రేజ్ సంపాదించుకుని సినిమాల్లోకి వెళ్లిపోయిన వేణు వండర్స్, శకలక శంకర్, ధనాధన్ ధన్‌రాజ్ లాంటి వారిని తిరిగి మళ్లీ జబర్ధస్త్‌లోకి రానున్నారని ప్రచారం జరుగుతోంది. వీళ్లు మళ్లీ జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇస్తే… కార్యక్రమం నుంచి వెళ్లిపోయిన స్థానాలు భర్తీ అవుతాయనే భావనలో మేనేజ్‌మెంట్ ఉన్నట్టు సమాచారం. మరేం జరుగుతుందో చూడాలి.

Related posts