పవర్స్టార్ పవన్కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’ . ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. . బాలీవుడ్ తారలు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కూడా ఇందులో నటిస్తున్నారు.
17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్షాహీల శకం నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో రూపొందుతోంది. అప్పటి వాతావరణం ప్రతిబింబించేలా పలు చారిత్రక కట్టడాల్ని సెట్స్గా తీర్చిదిద్దుతూ, ఆ నేపథ్యంలోనే చిత్రీకరణ చేస్తున్నారు. ఇప్పటికే సగం సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్ మళ్లీ మొదలైంది. నిపుణుల ఆధ్వర్యంలో బల్లెంతో పోరాట ఘట్టానికి సంబంధించిన సన్నివేశాల కోసం శిక్షణ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్రబృందం పోస్ట్ చేసింది.
మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు.
తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ ఏడాది విజయ దశమికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
గన్ను పట్టిన పెన్ను పట్టిన కత్తిపట్టిన మైకు పెట్టినా ఏది పట్టిన ఎవరి పై గురి పెట్టిన మీకు తీరుగు లేదు దేవర 👌 @PawanKalyan pic.twitter.com/WlKa6lnxE0
— BANDLA GANESH. (@ganeshbandla) April 7, 2022