telugu navyamedia
సినిమా వార్తలు

‘ఆచార్య’కు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..

*’ఆచార్య’ సినిమా ఐదో షోకు వారం రోజుల పాటు అనుమతి

*టికెట్ల పెంపునకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

మెగాస్టార్‌ చిరంజీవి, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చరణ్ క‌లిసి న‌టిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో చిరంజీవి న‌క్స‌లెట్స్‌గా క‌నిపించ‌నున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన‌ ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవుతోంది.

 ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో చిరంజీవి‌తో పాటు రామ్ చరణ్ కూడా కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. (Twitter/Photo)

విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఆచార్య టీమ్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. ఇక ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మించారు.

 Acharya | మెగాస్టార్  హీరోగా రామ్ చరణ్ మరో ముఖ్య పాత్రలో నటించిన మూవీ ‘ఆచార్య’. విడుదలకు మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచింది. తాజాగా ఈ సినిమాకు  ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. (Twitter/Photo)

తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం ఆచార్య చిత్ర‌యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది . తెలంగాణలో ఆచార్య టికెట్‌ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఈనెల 29 నుంచి మే 5 వరకు టికెట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం ఒక్కో టికెట్‌పై మల్టీప్లెక్స్‌లో రూ. 50, సాధారణ థియేటర్స్‌లో రూ. 30 పెంచుకునేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.అంతేకాదు 29 నుంచి మే 5 వరకు వారం రోజుల పాటు రోజుకు ఐదు షోకు అనుమతులు జారీ చేస్తూ జీవో విడుదల చేసింది.

 ఈ సినిమాకు తెలంగాణలోని మల్టీప్లెక్స్ సహా ఏసీ థియేటర్స్‌లో వారం రోజుల పాటు రూ. 50 పెంపుకు అనుమతి ఇచ్చింది. అంతేకాదు మాములు థియేటర్స్‌లో మాత్రం రూ. 30 వరకు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. అంతేకాదు 29 నుంచి మే 5 వరకు వారం రోజుల పాటు రోజుకు ఐదు షోకు అనుమతులు జారీ చేస్తూ జీవో విడుదల చేసింది. (Twitter/Photo)

Related posts