మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించి మెగా అభిమానులకు కనువిందు చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ తనయుడి వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ఒకే వేదికపై మెగా బ్రదర్స్ ఇద్దరూ ప్రేమ పూర్వకంగా ఆలింగనం చేసుకొని ఫోటోలకు నవ్వుల పోజులివ్వడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. పవర్ స్టార్ వైట్ అండ్ వైట్ లో కనిపిస్తే.. మెగస్టార్ బుడిద రంగు షర్ట్లో చాలా సింపుల్గా కనిపించారు.
చిరంజీవి ఎడమ చేతికి గాయం అవ్వటంతో కట్టు కట్టుకుని ఉన్నారు. పవన్ కల్యాణ్, తన అన్నయ్య చేతిలో చేయి వేసి నవ్వుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఏది ఏమైనా పెళ్ళి వేడుకలో అన్నదమ్ములిద్దరూ కలిసి చూడడం అభిమానుల ఆనందానికి హద్దులు లేవని చెప్పాలి.