రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అనుభవించు రాజా’. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కషీప్ఖాన్ హీరోయిన్గా నటిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే ఓ యూత్ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కింది.
ఇటీవలే విడుదలైన ఈ సినిమా లో రాజ్ తరుణ్ ఫస్టులుక్ పోస్టర్ లుక్లో జాతర కోలాహలం మధ్య, కోడితో కలిసి పందేనికి సిద్ధమవుతున్నట్టుగా కనిపించాడు. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్మీడియా వేదికగా విడుదల చేశారు.
ఇందులో రాజ్ తరుణ్ లుక్ చూస్తుంటే పేకాట .. కోడిపందాలుతో జీవితాన్ని విలాసవంతంగా గడిపేసేవాడిలా కనిపిస్తున్నాడు ‘బంగారం గాడు ఊర్లోని.. వాడి పుంజు బరిలోని ఉండగా.. ఇంకొండు గెలవడం కష్టమెహే’ అంటూ ఆయన చెప్పే డైలాగ్లు ఆకట్టుకునేలా ఉన్నాయి.అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా, ఫన్ పండించే డైలాగ్స్ తో ట్రైలర్ ను కట్ చేశారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకి సిద్ధమైందని సినీ వర్గాలు తెలిపాయి. సుప్రియ యార్లగడ్డ నిర్మాత వ్యవహారిస్తున్న ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి, ఆడుగలమ్ నరేన్, అజయ్ సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ, రవికృష్ణ, భూపాల్ రాజు, అరియానా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.