బాలీవుడ్కు చెందిన ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ పర్వేజ్ఖాన్ (55) గుండెపోటుతో గత రాత్రి మృతి చెందారు. ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణించారని బాలీవుడ్ వర్గాల సమాచారం. 35 సంవత్సరాల పాటు చిత్రసీమకు సేవలందించిన పర్వేజ్ఖాన్.. తన కెరీర్లో మొత్తం 56 చిత్రాలకు యాక్షన్ డైరెక్టర్గా పనిచేశారు. 1986లో సినీ కెరీర్ ప్రారంభించిన ఆయన 2004లో ఇండిపెండెంట్ యాక్షన్ డైరెక్టర్గా పనిచేయడం మొదలుపెట్టారు. షాహిద్, సోల్జర్, బాజీగర్, బుల్లెట్ రాజా తదితర చిత్రాలకు పర్వేజ్ యాక్షన్ డైరెక్టర్గా వ్యవహరించారు. అలాగే శ్రీరామ్ రాఘవన్తో కలిసి జానీ గద్దర్, ఏజెంట్ వినోద్, బద్లాపూర్, అంధధుంజధ్ వంటి చిత్రాలకు కూడా ఆయన పనిచేశారు. పర్వేజ్ఖాన్కు భార్య, కొడుకు, కోడలు, మనవరాలు ఉన్నారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
previous post
బిగ్బాస్ సీజన్ 4పై నాగార్జున ఎమోషనల్ కామెంట్..