టాలీవుడ్ స్టార్ హీరోలలో సూపర్స్టార్ మహేష్ బిజినెస్ స్ట్రాటజీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అలు సినిమాల్లోనూ ఇటు బిజినేస్ లోనూ రాణిస్తున్నారు. ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న మహేశ్ బాబు తాజాగా మరో కంపెనీకి అంబాసిడర్గా నియమితులయ్యారు.
ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ ‘బిగ్ సి’ కంపెనీ ప్రచారకర్తగా హీరో మహేశ్ బాబును నియమించుకున్నారు. బిగ్ సి సంస్థకు ఇప్పటివరకు హీరోయిన్లే అంబాసిడర్లుగా వ్యవహరించగా ఇప్పుడు మహేశ్ బాబు రూపంలో తొలిసారిగా ఓ హీరో బిగ్ సి సంస్థకు అంబాసిడర్ గా నియమితులయ్యారు. దానికి సంబంధించిన ప్రమోషనల యాక్టివిటీలో మహేశ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎండీ మాట్లాడుతూ.. తమ కంపెనీకి మహేష్బాబు లాంటి స్టార్ ప్రచారకర్తగా ఉండడం తమకు ఎతో మేలు జరుగుతుందని, ఇందులో భాగంగా నూతనంగా ఏర్పాటు చేయనున్న స్టోర్లను చిన్న నగరాలకు విస్తరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కరోనాతో కుదేలైన మొబైల్ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్లు, వచ్చే ఏడాది రూ.1,500 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
ఇదే ఈ క్రమంలో ఆయన అభిమానులు, విలేకరులు మహేశ్ బాబు వాడిన ఫోన్లు, కొత్త సినిమాల అప్డేట్లు గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మహేశ్ చిరు నవ్వుతో వారికి సమాధానమిచ్చారు. ‘మీరు తొలిసారిగా కొన్న ఫోన్ ఏదని’ అని ఒకరు అడగ్గా ‘నోకియా క్లాసికల్ మోడల్ (కీ ప్యాడ్)’ అని తెలిపారు. ‘మీతో సెల్ఫీ తీసుకునే అవకాశం కోసం ఎంతోమంది ఎదురుచూస్తుంటారు. మరి మీరు ఎవరితో సెల్ఫీతో దిగాలనుకుంటారు?’ అనే ప్రశ్నకి ‘మా ఫాదర్తో’ అని చెప్పారు.
జయలలిత పాత్రలో నటించడానికి నేనే పర్ఫెక్ట్ : నిత్యామీనన్