వీ6 తెలుగు న్యూస్ ఛానెల్లో తీన్మార్ సావిత్రిగా పాపులర్ అయిన శివజ్యోతి… ఆ తర్వాత అదే పాపులారిటీతో స్టార్ మా ఛానెల్ వారి బిగ్బాస్ 3లో ఒక పార్టిసిపేంట్గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు బుల్లితెర ప్రేక్షకుల మన్నన పొందింది. గత వారం ఎలిమేషన్ ప్రక్రియలో భాగంగా శివజ్యోతి బిగ్బాస్ హౌస్ నుండి బయటకు వచ్చింది. ఈ సందర్భంగా పలు టీవీ ఛానెల్స్తో పాటు యూట్యూబ్ ఛానెల్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివజ్యోతి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తనకు బిత్తిరి సత్తితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. తామిద్దరం వీ6 ఛానెల్లో ఉన్నపుడు అన్నా చెల్లెల కలిసి ఉండేవాళ్లం. తెరపై మేము అక్కా తమ్ముళ్లము అయినా.. నిజ జీవితంలో మాత్రం అన్నా చెల్లెల అనుబంధం. బిత్తిరి సత్తి మొదట ఏమి చేసినా.. నా అభిప్రాయాన్నే అడిగేవారు. నా నిర్ణయంపై బిత్తిరి సత్తికి అంత నమ్మకం ఉండేదని చెప్పుకొచ్చింది శివజ్యోతి. నేను ఒక మహిళగా నా వరకు మంచి గుర్తింపును సంపాదించుకున్నాను. ఇంకా ఏదైనా సాధించాలనే కసితోనే నేను బిగ్బాస్ ప్రోగ్రామ్ వెళ్లాను. ఇక బిగ్బాస్లోకి వెళుతున్నట్టు నేను బిత్తిరి సత్తికి చెప్పలేదని చెప్పింది. నా మటకు నేనైతే ఎక్కువే సాధించానని చెప్పింది. ఇక మహిళ నా కెరీర్ ఎలా సాగుతుందనేది చెప్పలేను. ఒకవేళ కెరీర్ ఎండ్ అయితే.. తన భర్త పిల్లలతో సుఖంగా గడుపుతానని చెప్పుకొచ్చింది. అంతేకాదు వీ6 ఛానెల్ సీఈవో వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. అంతేకాదు తనకు సావిత్రి అనే పేరు పెడుతున్నారనే విషయం కూడా తెలియదని చెప్పింది. దాన్ని నా ఓన్ స్టైల్లో నాకు అనుకూలంగా మార్చుకున్నానని చెప్పింది. ఇండస్ట్రీలో ఎపుడు మేల్ డామినేషన్ ఉంటుందని కుండబద్ధలు కొట్టింది. తనకంటూ బిత్తిరి సత్తికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారని తన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆయనకున్నడిమాండ్ అటువంటిదని చెప్పింది. కానీ బిత్తిరి సత్తి మాత్రం ఎన్నో ఆశలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆయన అక్కడ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాని చెప్పడం విశేషం.
ఎన్టీఆర్, అల్లుఅర్జున్ లతో సినిమా అంటే నిద్ర పట్టదు… నిధి అగర్వాల్