telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

ఈ నెల 22న సమ్మెకు దిగనున్న బ్యాంకు ఉద్యోగులు

bank strikes on 22nd october

ఈ నెల 22న దేశ వ్యాప్త సమ్మెకు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పిలుపు నిచ్చాయి. బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఈ) నేతలు బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు.

ఆర్థికంగా బలోపేతం చేయాలనే పేరుతో బ్యాంకుల విలీనం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులు 27 నుంచి 12కు తగ్గిపోతాయని, తద్వారా ఉపాధి పోతుందని, ఉద్యోగ భద్రత ఉండదని అన్నారు. కాగా, విజయవాడలో ఆంధ్రా బ్యాంకు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బ్యాంకుల విలీనం ఆపాలని, ఆంధ్రాబ్యాంకును కొనసాగించాలని ఈ సమావేశంలో డిమాండ్ చేశారు.

Related posts