ప్రధాని నరేంద్ర మోదీని గద్దే దించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్ని కూటమిగా ఏర్పడ్డ సంగతి తెలిసిందే. కేంద్రంలో ఏ పార్టీకి సరైన మెజారిటీ రానీ పక్షంలో విపక్షాలన్ని కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా పార్టీల నాయకులంతా ప్రధాని పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి ప్రధాని పదవి దక్కకపోయినా ఇబ్బంది లేదని తేల్చి చెప్పారు. పట్నాలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ కాంగ్రెస్కు మద్దతుగా అన్ని పార్టీలు కలిసి ఓ కూటమిగా ఏర్పాడితే, ఆ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. అప్పుడు ప్రధాని పదవి కాంగ్రెస్ పార్టీకి దక్కకపోయినా పెద్దగా బాధ పడమని అన్నారు. ఎందుకంటే బీజేపీని గద్దే దించడమే మా ప్రధాన ధ్యేయం అని తెలిపారు.
ప్రజల తరుపున ప్రశ్నిస్తే కేసులు..టీఆర్ఎస్ పై జగ్గారెడ్డి ఫైర్!