telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ముగిసిన మొదటి సెషన్… 74/3 తో ఇంగ్లాండ్..

భారత్ తో జరుగుతున్న చివరి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను భారత యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ మొదట్లోనే దెబ్బ తీసాడు. ఇద్దరు ఓపెనర్లను వరుస ఓవర్లలో ఔట్ చేసాడు. ఆ ఆతర్వాత భారత యువ పేసర్ సిరాజ్ ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్(5) ను వెనక్కి పంపాడు. దాంతో ప్రస్తుతం ఇంగ్లాండ్ 30/3 తో నిలిచింది. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన స్టోక్స్(24) అలాగే బెయిర్‌స్టో(28) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా మొదటి సెషన్ ను పూర్తి చేయడంతో ప్రస్తుతం ఇంగ్లాండ్ 74/3 తో నిలిచింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న మేతేరా పిచ్ గత మ్యాచ్ లో స్పిన్ కు బాగా అనుకూలించింది. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం అంతగా బాల్ టర్న్ కావడం లేదు అనే చెప్పాలి. అయితే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లాలంటే భారత్ ఈ మ్యాచ్ చాలా కీలకం. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

Related posts