తెలంగాణ కాంగ్రెస్ నేత, మల్కాగ్జిరి ఎంపీ రేవంత్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలసి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని ఢిల్లీ లో కలిశారు. సోనియాను కలిసిన వారిలో ఆయన భార్య, కూతురు, అల్లుడు ఉన్నారు. తెలంగాణలోని పార్టీ వ్యవహారాలపై సోనియాతో రేవంత్ చర్చించినట్లుగా సమాచారం.
నాయకత్వ మార్పు జరిగితే పీసీసీ రేసులో రేవంత్ పేరు వినిపిస్తున్నసమయంలో సోనియాను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో అదే బాటలో నడిచిన రేవంత్ రెడ్డి టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. సోనియాను రేవంత్ కుటుంబ సభ్యులు కలిసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.