దేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం… మెల్ల మెల్లగా దేశమంతటా కషాయ జెండాను ఎగురవేయాలని అనుకుంటోంది. దీని కోసం ఎన్నో ఎత్తులు పై ఎత్తులు వేస్తుంది మోడీ సేన. బీజేపీకి ఎదురు గాలి వీచే రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఫోకస్ చేసింది. దీంతో కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకుని సౌత్ ఇండియా రాష్ట్రాల్లో పాగ వేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే తెలంగాణలో ఇతర పార్టీల్లోని అసంతృప్త నాయకులను బీజేపీ లాగేసుకుంటోంది. అంతేకాదు.. సిని గ్లామర్ ఉన్న నాయకులను కూడా పార్టీలోకి ఆహ్వానిస్తోంది. అయితే.. తాజాగా సీనియర్ నటి వాణీవిశ్వనాధ్ బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం అందుతోంది. కొద్ది రోజుల కిందటే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా వాణీ విశ్వనాధ్తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె బీజేపలో చేరనున్నారనే వార్తలకు బలం చేకూరింది. అయితే.. తాజాగా బీజేపీలో చేరికపై స్పష్టత వచ్చింది. వాణీ విశ్వనాధ్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లుగా బీజేపీ కీలక నేత సత్యమూర్తి తెలిపారు. అంతేకాదు.. ఆమె త్వరలో జరుగబోయే తిరుపతి సభలో బీజేపీలో చేరతారని పేర్కొన్నారు సత్యమూర్తి. ఈ విషయాన్ని ఓ ప్రముఖ దినపత్రికలో ఆయన వెల్లడించారు. అయితే.. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
previous post
next post