ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ఫిలిం నగర్ కల్చరల్ సొసైటీ కి విశాఖ పట్టణం లో ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తూ నిన్న ఉత్తర్వు ఇచ్చారు . విశాఖపట్టణం లోని రురల్ మండలంలోని మధురవాడలో ని గ్రామంలో సర్వే నెంబర్ 426/3 , జీ ఓ ఎంఎస్ నెంబర్ 571 ప్రకారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ మన్ మోహన్ సింగ్ ఈ ఉత్తర్వు జారీ చేశారు .
ఎకరానికి రెండు లక్షల ప్రకారం సంవత్సరానికి 10 లక్షల రూపాయలు ప్రభుత్యానికి చెల్లించే షరతు మీద ఈ భూమిని కేటాయించినట్టు ఈ ఉత్తర్వులో పేర్కొన్నారు . ప్రతి సంవత్సరం 10 లక్షలు చెల్లించాలి . నిజానికి మూడు సంవత్సరాల క్రితమే ప్రభుత్వం ఐదు ఎకరాల భూమి ఫిలిం నగర్ కల్చరల్ సొసైటీ కి కేటాయించింది . అప్పుడు ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు విశాఖ విమానాశ్రయం నుంచే ఈ భూమికి శంకుస్థాపన చేశారు . అయితే ఆ భూమి బౌద్ధ ఆరామ పరిధిలో ఉందని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో క్లబ్ కు కేటాయించవద్దని నిరసనలు వ్యక్తమయ్యాయి . ఈ ప్రతిఘటనతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడిపోయింది .
ఆ భూమిని బౌద్ధ ఆరామం వారికే వదిలేసి ఇప్పుడు మధురవాడ లో ఐదు ఎకలాలను కేటాయిస్తూ ఉత్తర్వు జారీ చేశారు . విశాఖ పట్టణం లో ఏర్పాటైన ఈ ఫిలిం నగర్ కల్చరల్ సొసైటీ కి అధ్యక్షుడు నిర్మాత కె . ఎస్ రామారావు .