telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రజల తరుపున ప్రశ్నిస్తే కేసులు..టీఆర్‌ఎస్‌ పై జగ్గారెడ్డి ఫైర్!

Jaggareddy gives clarity party change

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీపై మరోసారి మాదిపడ్డారు. ప్రజల తరుపున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులతో చర్చకు తాను సిద్ధమంటూ సవాల్ విసిరారు. గత నాలుగేళ్లుగా సంగారెడ్డి నియోజకవర్గానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు.

అధికారంలో లేకపోయినా నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగల సత్తా తనకు ఉందని స్పష్టం చేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్దికి ఎన్ని కోట్ల నిధులు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఆనాడు మంత్రిగా హరీష్‌రావు సింగూరు నుంచి నీళ్లు వదిలిపెడుతుంటే ప్రభాకర్‌రెడ్డి, చింతా ప్రభాకర్‌ ఎందుకు అడ్డుకోలేదో చెప్పాలని నిలదీశారు. ప్రజల తరపున ప్రశ్నిస్తే కొంతమంది తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని వ్యక్తిగత విమర్శలకు దిగితే తన ప్రతాపం చూపిస్తానని హెచ్చరించారు. సోమవారం కాంగ్రెస్‌ నుంచి పురపాలక చైర్మన్‌ అభ్యర్థుల్ని ప్రకటిస్తానని జగ్గారెడ్డి తెలిపారు.

Related posts