ఛత్తీస్ గఢ్ లోని దంతరి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు నక్సల్స్ మృతి చెందారు. యాంటీ నక్సల్ ఆపరేషన్ లో భాగంగా జిల్లాలోని ఖల్లారి అటవీప్రాంతంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులకు పాల్పడడంతో ఎస్టీఎఫ్ పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు నక్సల్స్ మృతి చెందారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు. సంఘటనా స్థలంలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అటవీప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
previous post
మహేశ్ బాబు అందం గురించి సుమ ప్రశంసలు