telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

వ్యాక్సిన్ తీసుకున్న మహానటి…

మన దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా విషయం తెలిసిందే. దాని కోసం ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు. దాంతో చాలా మంది సెలబ్రెటీలు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇక తాజాగా కీర్తి సురేష్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ ను చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తీసుకున్నారు. ప్రస్తుతం కీర్తి వ్యాక్సిన్ వేయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో రౌండ్లు వేస్తున్నాయి. కీర్తి సురేష్ ఇటీవల కోవిడ్ -19 వ్యాక్సినేషన్ కోసం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుంది. తాజాగా మాస్క్ ధరించి వ్యాక్సిన్ వేయించుకున్న పిక్ ను ఇన్స్టా లో షేర్ చేసుకున్న కీర్తి ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. ఇక ప్రస్తుతం కీర్తి మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Related posts