మహబూబ్నగర్ జిల్లాలోని కోయిలకొండ మండలం సూరారం ప్రాథమిక పాఠశాలలో విషాద సంఘటన చోటు చేసుకుంది. తేనెటీగలు దాడి చేయడంతో 24 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. గ్రామస్తులు, ఉపాధ్యాయులు విద్యార్థులను హుటాహుటిన మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇందులో వాంతులతో 8మంది తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ఆస్పత్రి సూపరింటెండెంట్కు ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షించారు. పరిస్థితి విషమంగా ఉన్న విద్యార్థులకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని వైద్యులకు సూచించారు.
previous post