ఆంధ్రప్రదేశ్లో ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం ప్రకటించారు. కరోనా వైరస్తో లాక్డౌన్ కారణంగా ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే.
సెప్టెంబర్ 17 నుంచి 25 వరకూ ఇంజనీరింగ్ ఎంసెట్ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సెప్టెంబర్ 10,11 తేదీల్లో ఐసెట్, 14న ఈసెట్, 28,29,30 తేదీల్లో ఏపీ పీఈసెట్, అక్టోబర్ 1న ఎడ్సెట్, 2వ తేదీన లాసెట్ నిర్వహించనుంది.