మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఎ.బి.వెంకటేశ్వరరావు పై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటువేసింది. భద్రతా పరికరాల కొనుగోలులో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆయనను సస్పెండు చేసింది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ పై వెంకటేశ్వరరావు స్పందించారు.
విజయవాడలో ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అక్రమాల కారణంగానే తనపై చర్యలు తీసుకున్నారని మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. ఈ చర్యతో మానసికంగా తనకు వచ్చిన ఇబ్బంది ఏమీలేదన్నారు. అందువల్ల బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని కోరారు. ఈ వ్యవహారంలో తాను చట్టపరంగా ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు.ప్రభుత్వం తదుపరి చర్య ఏమిటన్నది త్వరలో తెలుస్తుందని తెలిపారు.