గాల్వన్ లోయలో ఇటీవల భారత్, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు మరణించినట్టు సైన్యం పేర్కొంది. తాజాగా సచిన్ విక్రమ్ మోరే అనే మరో సైనికుడు కూడా వీరమరణం పొందినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
సచిన్ మోరే గాల్వన్ లోయ ఘర్షణల సమయంలో నదిలో పడిపోయిన ఇద్దరు సహచరులను కాపాడే ప్రయత్నంలో తాను కన్నుమూశాడు. సచిన్ మోరే మరణాన్ని భారత సైన్యం ధ్రువీకరించింది. దీంతో గాల్వన్ లోయ మృతుల సంఖ్య 21కి చేరింది. సచిన్ మోరే స్వస్థలం మహారాష్ట్రలోని మాలేగావ్ తాలూకా సాకురి గ్రామం. ఆయన మరణ వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.