చైనా నుండి వచ్చిన మన దేశంతో పాటు ప్రపంచంలోని మిగిత దేశాలను కూడా వణికిస్తోంది. అయితే 2019 వచ్చిన ఈ వైరస్ తీవ్రత రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడ్డారు. ఈ వైరస్ పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ సోకుతోంది. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది కరోనా బారీన పడ్డారు. అటు క్రీడాకారులను కరోనా వైరస్ వణికిస్తూనే ఉంది. తాజాగా… బ్రిటన్ టెన్నిస్ స్టార్, మాజీ ప్రపంచ నంబర్ వన్ ఆండీ ముర్రే కరోనా బారీన పడ్డాడు. ముర్రేకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు గురువారం ప్రకటించడంతో రాబోయే ఆస్ట్రేలియా ఓపెన్-2021లో టెన్నిస్ స్టార్ పాల్గొనడం అనుమానంగా మారంది. టోర్నమెంట్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన చార్టర్ విమానంలో ముర్రే ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం లండన్లోని తన ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నాడు. అయితే…ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రెస్ అసోషియేషన్ తెలిపింది.
previous post
జగన్ నామినేషన్లు కూడా తెలంగాణలోనే వేస్తారా?: లోకేశ్