దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్య కేసులో నిందితులను చంపేయాలని డిమాండ్లు వినిపించారు. ఈ నేపథ్యంలో ఆ డిమాండ్లను నిజం చేస్తూ తెలంగాణ పోలీసులు దిశ నిందితులను ఈ రోజు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపారు. దీనిపై భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ స్పందించాడు.
శభాష్ తెలంగాణ సీఎం కేసీఆర్, శభాష్ తెలంగాణ పోలీస్ అంటూ అభినందించాడు. మీరు ఏదైతే చేశారో అది కచ్చితంగా అభినందించాల్సిన విషయమని హర్భజన్ వ్యాఖ్యానించాడు. మరెవ్వరూ ఇలాంటి నేరాలకు పాల్పడే ధైర్యం చేయరని, ఇది సరైన చర్య అని హర్భజన్ కొనియాడాడు.