అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే నాయకురాలు వీకే శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 27న ఆమె జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. అందుకోసం ఆమె రూ. 10 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని కర్ణాటక జైళ్ల శాఖ తెలిపింది. రూ. 66 కోట్ల అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ 2017 నుంచి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉంటున్నారు.
జైలు రికార్డుల ప్రకారం శశికళ బహుశా వచ్చే ఏడాది జనవరి 27న విడుదలయ్యే అవకాశం ఉందని పరప్పన అగ్రహార జైలు సూపరింటెండెంట్ ఆర్. లత, ఆర్టీఐ కింద వచ్చిన దరఖాస్తుకు సమాధానంగా పేర్కొన్నారు. ఈ నెల 11న టి. నరసింహమూర్తి అనే కార్యకర్త ఈ దరఖాస్తు చేశారు. ఒకవేళ శశికళ జరిమానా చెల్లించకుంటే మాత్రం 27 ఫిబ్రవరి 2022 వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఇప్పడు మోదీలో భయం కనిపిస్తోంది: రాహుల్