ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో ఈ రోజు ఆటో డ్రైవర్లు కలిశారు.రోడ్ ట్యాక్స్ రద్దు చేసిన సందర్భంగా వారు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా చంద్రబాబు స్వయంగా ఆటో నడిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఇంకా ఎన్నో చేస్తానని అన్నారు. రూ.140 కోట్ల నష్టం వస్తుందని చెప్పినా… ఆటో డ్రైవర్లకు భారం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రంలో ఆర్థిక కష్టాలు ఉన్నా ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్నానని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో అన్నీ ఎలక్ట్రికల్ వాహనాలే ఉంటాయన్నారు. కాగా ఇన్సూరెన్స్ భారం ఎక్కువుందని సీఎంకు ఆటో డ్రైవర్లు విజ్ఞప్తి చేశారు. ఒక యూనియన్గా ఏర్పడి వస్తే ఇన్సూరెన్స్ భారం లేకుండా చూస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.