telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఈ నెలలోనే.. ఏపీలో ప్రధాని పర్యటన.. కన్నా

ఏపీలో ఇటీవల ప్రధాని పర్యటన రద్దైన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటన ఆ రాష్ట్రప్రజలలో బీజేపీ పట్ల ఉన్న వ్యతిరేకత కారణంగానే వాయిదా పడ్డట్టు సమాచారం. ఇప్పుడు మరో సారి పర్యటన చేయనున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెపుతున్నారు. ఆ పర్యటన కూడా ఈ నెలలోనే జరగనున్నట్టు వారు అంటున్నారు. ఈ నెల 10న గుంటూరులో, 16న విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నట్టు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో జరుగుతున్న అవినీతిపై మోదీ గళం విప్పుతారని, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఏపీకి ఇచ్చిన నిధులను ఆయన వివరించనున్నట్లు చెప్పారు.

అదే విధంగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఏపీలో పర్యటిస్తారని అన్నారు. ఈ నెల 4న విజయనగరంలో నిర్వహించే పార్లమెంట్ స్థాయి శక్తి కేంద్రాల సభ్యులతో సమావేశమవుతారని, అనంతరం, పలాస నుంచి సత్యమే జయతే బస్సు యాత్రను ఆయన ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ నెల 19న ఒంగోలులో, 21న రాజమహేంద్రవరంలో శక్తి కేంద్రాల సభ్యులతో అమిత్ షా సమావేశం కానున్నట్టు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.

Related posts