telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

చెన్నై ప్రభుత్వ కరోనా ఆసుపత్రిలో దారుణం…

చెన్నై ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. నగదు, సెల్ ఫోన్ కోసం సునీత అనే కోవిడ్ రోగిని హత్య చేసింది ఆసుపత్రి కాంట్రాక్ట్ ఉద్యోగిణి రతీదేవి. మే 23న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భార్య ఆసుపత్రిలో కనపడడం లేదని ఇది వరకే పోలీసులకు ఫిర్యాదు చేసాడు సునీత భర్త మౌళి.ఆసుపత్రి వెనుక ఈ ఉదయం సునీత మృతదేహం లభ్యమైంది. దాంతో ఘటన వెలుగులోకి రావడంతో నిందితురాలు రతీదేవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న సునీత వద్ద ఉన్న నగదు, సెల్ ఫోన్ కాజేసేందుకే హత్య చేసినట్లు రతీదేవి అంగీకరించింది.

Related posts