telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కపిల్ శర్మ టాక్ షోలో… రామాయణం సీరియల్ నటులు

ramayan

మూడు దశాబ్దాల క్రితం బుల్లితెరపై దూరదర్శన్‌లో ఎంతో మంది ప్రేక్షకుల మనస్సులను దోచుకున్న సీరియల్ రామాయణం. రాముడు, లక్ష్మణుడు, సీతగా నటించిన అరుణ్ గోవిల్, దీపిక చిఖలియా, సునీల్ లాహిరిలు కపిల్ శర్మ టాక్ షోలో సందడి చేశారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను షో నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. రామాయణం కోసం భారీ కాస్ట్యూమ్స్ ధరించడం, అలాగే తలపై కిరీటం పెట్టుకోవడం వల్ల దురదగా అనిపించలేదా అని కపిల్ అరుణ్ రాముడి పాత్ర ను ప్రశ్నించారు. కాస్ట్యూమ్స్ ధరిస్తేనే కాదు..ఒక్కోసారి వాటిని చూస్తేనే దురదగా అనిపించేంది అంటూ వ్యాఖ్యానించారు. ఇక రాధిక మాట్లాడుతూ..తనకు సీత పాత్ర ఎంతో గుర్తింపు తెచ్చిందని, చాలా మంది చేతులు జోడించి నమస్కారం పెడుతారన్నారు. ఈ షో 2020, మార్చి 07వ తేదీ శనివారం ప్రసారం కానుంది.

Related posts