telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గ్రీన్ ఛాలెంజ్ లో చిరంజీవి కూతురు సుష్మిత

Sushmitha

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రముఖులందరూ ఉద్యమంలా చేపడుతున్నారు. తాజాగా ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ శిల్పా రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన చిరంజీవి గారి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల తన భర్త విష్ణుప్రసాద్ తో కలిసి ఈరోజు జూబ్లీహిల్స్ లోని తమ కార్యాలయం ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సుష్మిత మాట్లాడుతూ ఈరోజు మొక్కలు నాటడం నాకు చాలా సంతోషంగా ఉందని, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కరోనా వైరస్ ప్రభావం వల్ల లాక్ డౌన్ సమయంలో ఏదైనా మంచి పని చేశాము అంటే ఈరోజు ఈ మొక్కలు నాటడమే.నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇదేవిధంగా ఈ యొక్క ఛాలెంజ్ ను ఇంకా పెద్ద ఎత్తున అందరు ముందుకు తీసుకోనిపోయి బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మరో ముగ్గురు శ్రీజ, అల్లు స్నేహ రెడ్డి, స్వప్న దత్ లను మొక్కలు నాటాలని కోరారు.

Related posts