telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తెలుగు వాళ్లకి పక్కింటి పుల్ల కూరే ఇష్టం… నటి కవిత షాకింగ్ కామెంట్స్

kavita

నిర్మాతలు కోట్లల్లో ఖర్చుపెడుతున్నారు. ఈ పద్ధతి మార్చుకోవాలని ఇటీవల ‘ఓ పిట్ట కథ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తాను క్యారవ్యాన్లను కేవలం మేకప్ వేసుకోవడానికి బాత్రూమ్‌కు వెళ్లడానికి మాత్రమే ఉపయోగిస్తానని, అంతేకానీ సీన్ అయిపోగానే అందులోకి వెళ్లిపోవడంలాంటివి చేయనని అన్నారు. దీనిపై సీనియర్ నటి కవిత స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసారు.‘చిరంజీవిగారు చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజం. ఒకప్పుడు మాకు క్యారవ్యాన్లు ఉండేవి కావు. చెట్ల కింద మేకప్ వేసుకునేవాళ్లం, అక్కడే తినేవాళ్లం. చెప్పాలంటే చెట్ల వెనకాలే దుస్తులు కూడా మార్చుకునేవాళ్లం. సందర్భం వచ్చింది కాబట్టి కొన్నేళ్ల కిందట జరిగిన విషయాన్ని మీతో చెప్పాలని అనుకుంటున్నా. ఓ సినిమా షూటింగ్ సమయంలో నన్ను దుస్తులు మార్చుకుని రావాలని చెప్పారు. అప్పుడు నేను హీరోయిన్ క్యారవ్యాన్‌లోకి వెళ్లి మార్చుకోవాలని అనుకున్నా. కానీ ఆ హీరోయిన్ ఒప్పుకోలేదు. ఇది నా క్యారవ్యాన్. మీరు లోపలికి ఎలా వెళ్తారు అంది. దాంతో ప్రభుదేవా వచ్చి మేడమ్ మీరు నా క్యారవ్యాన్‌లోకి వెళ్లండి అని చెప్పారు. ‘నా క్యారవ్యాన్‌లోకి నువ్వు వెళ్లకూడదు అని ఓ హీరోయిన్ నాతో అన్నప్పుడు అక్కడే ఉన్న నిర్మాత ఆమెను తిట్టాల్సిందిపోయి చూస్తూ నిలబడిపోయాడు. నిర్మాతలే వీపులు గోకేస్తున్నారు. అలాంటప్పుడు చిరంజీవిలాంటి వాళ్లు ఎంత మాట్లాడి ఏం లాభం. నేను వరుసగా తమిళ సినిమాలు చేస్తున్నాను. ఎందుకంటే తెలుగు వాళ్లకి పక్కింటి పుల్ల కూరే ఇష్టం. తెలుగువారు తెలుగువారికే అవకాశం ఇవ్వరు. కానీ తమిళంలో అలా కాదు. వాళ్లు ముందు తమిళ నటీనటులకే అవకాశం ఇస్తారు.

Related posts