ఏపీ సీఎం జగన్ కు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లేఖ రాశారు. నీరుకొండ కొండపై అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. గతంలో చంద్రబాబు ఐనవోలులో 20 ఎకరాలలో అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటుకు శంకుస్దాపన చేశారని, అలాగే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్లు లేఖలో తెలిపారు.
ప్రస్తుతం స్మృతివనం పనులు ఆగిపోయాయని తెలిపారు. ఉగాది రోజున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేయాలన్నారు. గతంలో ఇదే నీరుకొండ కొండపై ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వచ్చాయని.. ఇప్పుడా స్థానంలో వంద అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఆర్కే లేఖలో కోరారు.
మహిళలను వేధించిన వైసీపీ నేతలు దర్జాగా తిరుగుతున్నారు: పంచుమర్తి అనూరాధ