telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జిందాల్ ప్లాంట్ ను పరిశీలించిన మంత్రి బొత్స సత్యనారాయణ

Bosta satyanarayana ycp

గుంటూరు : గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపేటలో వ్యర్థాల నుంచి విద్యుత్ తయారు చేసే జిందాల్ ప్లాంట్ ను పరిశీలించారు మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన మంత్రి బొత్స సత్యనారాయణ… జిందాల్ ప్లాంట్ ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2016 లో ప్లాంటు పనులు ప్రారంభమయ్యాయని… గత ప్రభుత్వంలో కేవలం 10 శాతం మాత్రమే పనులు పూర్తిచేసిందన్నారు. మేం అధికారంలోకి వచ్చాక ప్లాంట్ ప్రారంభ దశకు వచ్చిందనీ… గుంటూరు, విజయవాడ తాడేపల్లి -మంగళగిరి కార్పొరేషన్ తో పాటు మరొ ఆరు మున్సిపాలిటీలు నుంచి చెత్తను సేకరిస్తారని పేర్కొన్నారు. జిమదాల్ ప్లాంట్ కు నీటి సమస్య ,విద్యుత్ సమస్య ఉంది వాటిని పరిష్కరించామని… వచ్చే నెలలో ప్లాంటును ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
విశాఖపట్నంలో కూడా ఇలాంటి ప్లాంట్ నిర్మాణం లలో ఉందనీ ..జిందాల్ ప్లాంట్ చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల నుంచి చెత్తను కూడా సేకరిస్తామని తెలిపారు. ఈ ప్లాంటు ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు.

Related posts