telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఇండియా కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే..?

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ… మరణాల సంఖ్య పెరుగుతూ వస్తుంది . రోజు. తాజా కేసులతో దేశంలో 2.97 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 67,208 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్ప‌టివ‌ర‌కు ఇండియాలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,97,00,313 కి చేరింది. ఇందులో 2,84,91,670 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 8,26,740 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 2,330 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,81,903 కి చేరింది. ఇక ఇదిలా ఉంటే, గ‌డిచిన 24 గంటల్లో క‌రోనా నుంచి 1,03,570 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక‌పోతే, దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 26,55,19,251 ​మందికి వ్యాక్సిన్ అందించారు

Related posts