వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సొంత పార్టీపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఉత్సాహాన్ని కలిగించే వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో అన్న క్యాంటీన్లు బాగుండేవని అన్నారు. వాటిని నిలిపివేయడం బాధాకరంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం మన రాష్ట్ర ఖజానా పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో క్యాంటీన్లను నడపడం కూడా కష్టమేనని అన్నారు.
దళిత క్రైస్తవులు ఎస్సీ కోటాను అనుభవిస్తున్నారని అన్నారు. వీరివల్ల హిందూ దళితులు నష్టపోతున్నారని రఘురాజు చెప్పారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మంచి వ్యక్తి అని, స్వాభిమానం కలవారని కితాబునిచ్చారు. కాపుల కోసం ఆయన ఎంతో కృషి చేశారని ప్రశంసించారు.