రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మహిళా ఎంటర్ ప్రెన్యూరర్ గా, వెల్ నెస్ కౌన్సిలర్ గా, మహిళల హక్కుల కోసం పోరాడే యువతిగా, సమాజంలో ప్రత్యేక గుర్తింపును పొందాలని భావించానని అయితే ఆ దిశగా ఎంత కృషి చేస్తున్నా అనుకున్నది సాధించలేకపోయానని చెప్పుకొచ్చారు. ఇక రామ్ చరణ్ తో పెళ్లి తరవాత తనపై కోట్లాది మంది కళ్ళు పడ్డాయని, అంతే కాకుండా ట్రోల్స్ ఎక్కువగా వచ్చాయని తెలిపింది. అయితే వాటన్నింటికీ మెల్లిగా అలవాటు పడ్డానని, ఆ విషయంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇచ్చిన సలహాలు తనకెంతో ఉపయోగపడ్డాయని అన్నారు. పెళ్లి తరువాత తన జీవితంలో వచ్చిన మార్పులను గురించి వివరిస్తూ… వాటికి అడ్జస్ట్ కావడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. భార్యా భర్తలుగా చెర్రీ మరియు తన మధ్య మంచి స్వేచ్ఛ ఒకరిని మరొకరు గౌరవించుకునే అలవాటు ఉందని అన్నారు. లాక్ డౌన్ సమయంలో చరణ్ తో కలిసి ఉన్నానని ఇద్దరు కలిసి ఎంజాయ్ చేశామని తెలిపింది. చరణ్ కుటుంబం తనకు కేవలం ఓ సెలబ్రిటీ కుటుంబంగానే కాకుండా ఓ బిజినెస్ ఫ్యామిలీగా కూడా తెలుసునని చెప్పారు.
previous post