telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 10 రోజుల్లో రేషన్ కార్డులు!

cm jagan ycp

అర్హులైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలందించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్కరికీ శాచ్యురేషన్ పద్ధతిలో ప్రభుత్వ పథకాలు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లో రేషన్ కార్డులు, 20 రోజుల్లో ఆరోగ్య శ్రీ కార్డులు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు అందిస్తామనిప్రకటించింది.

ప్రభుత్వ సేవలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిర్దిష్ట కాలపరిమితితో అర్హులందరికీ అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ప్రజాసంక్షేమంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నట్టు పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి మొత్తం 541 రకాల సేవలు అందించనున్నారు.

Related posts