telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీకి ప్రవాసాంధ్రురాలు రూ.5 లక్షల విరాళం..చంద్రబాబుకు చెక్ అందజేత

chandrababu met nri in amaravati

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల అననతరం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రతిరోజూ ఎందరో కలుస్తున్నారు. అమరావతిలోని ప్రజావేదిక వద్ద తనను కలిసేవారితో ఫొటోలకు పోజులిస్తూ, టీడీపీ ఓటమి పట్ల బాధపడుతున్న వారిని ఓదార్చుతూ చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు.

ఈ క్రమంలో వేంపాటి కృష్ణవేణి అనే ప్రవాసాంధ్రురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె టీడీపీకి రూ.5 లక్షల విరాళాన్ని చెక్ రూపంలో చంద్రబాబుకు అందజేశారు. పార్టీ పట్ల అభిమానంతో విరాళం ప్రకటించిన కృష్ణవేణిని, ఆమె కుటుంబాన్ని చంద్రబాబు అభినందించారు.

Related posts