తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు 6 లక్షలు దాటేశాయి. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 748 కరోనా కేసులు, 8 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 6,20,613 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈరోజు కరోనా నుంచి కోలుకున్న వారు 1492 మంది కాగా.. ఇప్పటివరకు మొత్తం 6,02,676 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 3,635 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 14,302 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 81,405 మందికి కరోనా పరీక్షలు చేయడంతో.. ఇప్పటివరకు మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,83,27,887 కు చేరింది.
next post
పవన్ కల్యాణ్ లాంగ్మార్చ్ అట్టర్ఫ్లాఫ్: విజయ సాయిరెడ్డి