telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న జోగినిపల్లి సంతోష్ కుమార్

ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్ నగర్ డివిజన్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై తొలి మొక్కను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారితో కలిసి నాటిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు.

హైదరాబాద్ మహానగరం లాంటి ప్రదేశంలో వాహనాలు వివిధ కంపెనీల వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోతుందని దీన్ని తగ్గించాలంటే ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉన్న కొద్ది స్థలంలోనే మొక్కలను నాటి వాటిని పెంచాలని కోరారు.
ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీలో మనము ఏ విధంగా వాతావరణ కాలుష్యం పెరిగి పోతుందో చూస్తున్నామని అలాంటి పరిస్థితి మన హైదరాబాద్ నగరానికి రాకూడదంటే మనందరం బాధ్యతగా ఎవరికి వారు మొక్కలు నాటి వాటిని సంరక్షించే చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఇంత పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారికి అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, రహ్మత్ నగర్ కార్పొరేటర్ CN రెడ్డి, యూసఫ్ గూడా కార్పొరేటర్ రాజకుమార్ పటేల్, వెంగల్ రావు నగర్ కార్పొరేటర్ దేదివ్య, సోమాజిగూడ కార్పొరేటర్ సంగీత యాదవ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, నాయకులు, ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలు నాటడం జరిగింది.

Related posts