telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రఫేల్‌పై చర్చ అంటే మోదీ పారిపోతున్నారు: రాహుల్‌

Rahul support to Govt. terrarists attack

రఫేల్‌పై చర్చ అంటే ప్రధాని నరేంద్ర మోదీ పారిపోతున్నారని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ దుయ్యబట్టారు. ఈ ఒప్పందంపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. శుక్రవారం పార్లమెంట్‌ ఆవరణలో రాహుల్‌ మీడియాతో మాట్లాడుతూ రఫేల్‌పై విచారణ అవసరం లేదని సుప్రీం కోర్టు ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. దీనిపై విచారణకు ఆదేశించే పరిధి న్యాయస్ధానానికి లేదని మాత్రమే సర్వోన్నత న్యాయస్ధానం పేర్కొందని రాహుల్‌ అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రఫేల్‌ ఒప్పందంపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షిస్తుందని రాహుల్‌ అన్నారు.

రఫేల్‌పై తాము లేవనెత్తిన అంశాలన్నింటికీ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ బదులివ్వాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు రఫేల్‌ ఒప్పందంపై కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ సభను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆరోపించారు. లోక్‌సభలో నిర్మలా సీతారామన్‌ ప్రసంగానికి అడ్డుతగిలిన రాహుల్‌ ఒప్పందానికి సంబంధించి పలు అంశాలను లేవనెత్తారు. రఫేల్‌ డీల్‌ అంతా ప్రధాని నరేంద్ర మోదీ కనుసన్నల్లో జరిగిందని రాహుల్‌ అన్నారు.

Related posts