హైదరాబాద్లోని ఖైరతాబాద్ వినాయుకుడి తయారిలో కీలక ఘట్టం పూరైయ్యింది. ఈ సారి పంచముఖ మహాగణపతిగా భక్తులకు దర్శమివ్వనున్నాడు. వినాయక చవితికి నాలుగు రోజుల ముందే ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు సంపూర్ణ దర్శనమివ్వడం చరిత్రలోనే ఇది మొదటిసారి.
శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి పనులు పూర్తికావడంతో నిర్వాహకులు ఆదివారం కర్రలను పూర్తిగా తొలగించారు. ఏటా వినాయక చవితికి ఒక రోజు ముందు కర్రలు తొలగిస్తారు. కానీ.. ఈసారి నాలుగు రోజుల ముందే వీటిని పూర్తిగా తొలగించారు.
ఈ ఏడాది వినాయకుడు 40 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ మహాగణపతి గా రూపుదిద్దుకున్నాడు. అంతేకాదు ఖైరతాబాద్ వినాయుడు తయారు దగ్గరనుంచి నిమర్జనం వరకు ప్రతీ కార్యక్రమం ప్రత్యేకతే..ఈ స్వామి వారి దర్శనానికి ప్రతి ఏటా దూరప్రాంతాలనుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ సారి ఖైరతాబాద్ గణపతి..పంచముఖ మహాగణపతి ఆదిశేషుడు 5 తలతో దర్శనమివ్వనున్నాడు.