తెలంగాణలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్లో కాలేజీ బస్సు ఢీకొనడంతో స్కూటీపై వెళుతున్న డైట్ కాలేజీ విద్యార్థులు కిందపడిపోయారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో వారిపై నుంచి బస్సు దూసుకెళ్లడంతో ఒక విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందగా, మరో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రురాలిని హుటాహుటిన రిమ్స్కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
షరీఫ్ నిర్ణయం వెనుక చంద్రబాబు: కొడాలి నాని