telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

డబ్బులు తీసుకుని మౌనం.. కన్నాపై మంత్రి వెల్లంపల్లి ఫైర్

srinivasa rao minister

బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో గోదావరి పుష్కరాల్లో 23 మంది ప్రాణాలుకోల్పోతే కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. అప్పటి ప్రభుత్వం రాష్ట్రంలోని 40 ఆలయాలను కూల్చేసినప్పుడు కూడా కన్నా మాట్లాడలేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు నుంచి డబ్బులు తీసుకుని కన్నా మౌనంగా ఉండిపోయారని ఆరోపించారు.

అప్పట్లో టీటీడీ బోర్డు సభ్యుడయిన భాను ప్రకాశ్‌ రెడ్డి కూడా ఆ ఆలయ ఆస్తులను అమ్మాలని సంతకాలు చేశారని ఆయన చెప్పారు. తాను అప్పట్లో బీజేపీలో ఉన్న సమయంలో దేవాలయాలు పడగొట్టడాన్ని అడ్డుకున్నానని, దీంతో తనను అరెస్ట్ చేశారని ఆయన చెప్పారు. దీనిపై అప్పట్లో బీజేపీ స్పందిస్తూ.. తమకు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని తెలిపిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం దేవాలయాల డబ్బులను ఇమామ్‌లకి, పాస్టర్లకు ఇస్తోందని కొందరు అసత్య ప్రచారాన్ని చేస్తున్నారని మండిపడ్డారు.

Related posts