telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఈ నెల 15 నుంచి ఏపీఎస్ ఆర్టీసీ రిజర్వేషన్లు!

apsrtc bus

ఈ నెల 14 తర్వాత దేశవ్యాప్తంగా లాక్ డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రజా రవాణ పున:ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఎయిర్ ఇండియా మినహా మిగతా పౌర విమానయాన సంస్థలు 15వ తేదీ ప్రయాణాలకు బుకింగ్స్ ప్రారంభించాయి. లాక్ డౌన్ ను తొలగిస్తూ కేంద్రం నిర్ణయిస్తే 15వ తేదీ నుంచి రైళ్లను నడిపించేందుకు సిద్ధమని ఇండియన్ రైల్వేస్ స్పష్టం చేసింది. విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 127 రైళ్లకు 15 నుంచి బుకింగ్స్ మొదలైన సంగతి తెలిసిందే.

ఇక, ఏపీఎస్ ఆర్టీసీ సైతం 15 నుంచి బుకింగ్స్ ను ప్రారంభించింది. ఓపీఆర్ఎస్ ద్వారా ప్రయాణికులు రిజర్వేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఏసీ బస్సులకు మాత్రం ఇంకా రిజర్వేషన్ మొదలు కాలేదు. ఏసీ బస్ లను ఎక్కేందుకు ప్రజలు ఆసక్తి చూపించక పోవచ్చన్న ఉద్దేశంలో అధికారులు ఉన్నారని తెలుస్తోంది.

Related posts