telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణపై కేంద్రం వివక్ష: ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌

Akbaruddin mim

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ అన్నారు. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ.. జీఎస్టీ వల్ల రాష్ట్రంలో చిన్న పరిశ్రమలు భారీగా నష్టపోయాయని తెలిపారు.

రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజలకు అపార నమ్మకముందన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వానికి రెండోసారి కూడా ప్రజలు జై కొట్టారన్నారు. మైనార్టీల కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు అక్బరుద్దీన్‌ తెలిపారు.

Related posts