telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరాతిలో చంద్రబాబు ఇల్లు ఎందుకు కట్టుకోలేదు: వైసీపీ ఎమ్మెల్యే ఫైర్

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మండిపడ్డారు. అమరావతిలో ఏదో జరిగిపోతుందంటూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని అన్నారు. రాజధాని ప్రాంతం ముంపు కాదంటున్న చంద్రబాబు ఎందుకు అక్కడ ఇల్లు నిర్మించుకోలేదో చెప్పాలని నిలదీశారు. వరదలు వస్తున్నాయని తెలిసే ముందే చంద్రబాబు కుటుంబతో కలిసి హైదరాబాద్ పారిపోయారని దుయ్యబట్టారు.

ప్రపంచంలో అత్యున్నతమైన రాజధాని నిర్మాణం అమరావతి అంటూ వేలాది కోట్లు రూపాయలు దోచుకుని టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శించారు. ఈతకాయని తీసుకొచ్చి తాటికాయగా చూపాలనుకుంటున్నారని మండిపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు చేసిన ఇసుకమాఫియాను అరికట్టారని చెప్పుకొచ్చారు. త్వరలోనే వైసీపీ ప్రభుత్వం నూతన ఇసుకపాలసీని తీసుకు వస్తుందని స్పష్టం చేశారు.

Related posts