తెలంగాణ కాంగ్రెస్లో అసమర్థ నాయకత్వం ఉందని టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ పార్టీపై నమ్మకం లేకనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను కాపాడుకొనే దమ్ములేదుగానీ.. ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
కోమటిరెడ్డి సోదరులకు మతి భ్రమించిందన్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. నల్గొండ ఎంపీగా అభ్యర్థిగా వేమిరెడ్డి నర్సింహ్మారెడ్డిని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కార్యకర్తలు సమష్టిగా పనిచేసి భారీ మెజారిటీతో ఆయనను గెలిపించాలని చెప్పారు. 3 సార్లు ఎంపీగా ప్రజలకు సేవలందించాను. రైతు సమన్వయ సమితి చైర్మన్గా రైతులకు సేవ చేసే భాగ్యాన్ని కేసీఆర్ కల్పించారు. నన్ను ఎమ్మెల్సీ ప్రకటించినందుకు కేసీఆర్కు రుణపడి ఉంటానని గుత్తా పేర్కొన్నారు.