ఫణి తుఫాను ఎట్టకేలకు తీరాన్ని దాటింది. శుక్రవారం ఉదయం ఒడిషాలోని పూరీ సమీపంలో తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. తుపాన్ నేపథ్యంలో గురువారం రాత్రి నుంచి 24 గంటల పాటు భువనేశ్వర్ నగరంలోని బిజూపట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను నిలిపి వేశారు. బిజూపట్నాయక్ విమానాశ్రయాన్ని తుపాన్ వల్ల మూసివేశారు.
విమాన సర్వీసులతోపాటు 223 రైళ్లను శనివారం వరకు రద్దు చేశారు. విమానాలు, రైళ్లు కాకుండా బస్సుల రాకపోకలను నిలిపివేశారు. పారాదీప్, గోపాల్ పూర్, ధమ్రా ఓడరేవులను మూసివేశారు. తుపాన్ పూరి నగరానికి సమీపిస్తున్న నేపథ్యంలో గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తున్నాయి. పలుచోట్ల .విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.
కాలుష్యంపై బీజేపీ నేతల రాజకీయాలు: కేజ్రివాల్