జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి ముగ్గురు భార్యలని ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ వ్యాఖ్యల పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో ఇసుక సమస్యపై చంద్రబాబు ఈ రోజు విజయవాడలోని ధర్నాచౌక్లో దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…వైసీపీ నేతలు ప్రత్యర్థిపార్టీ నేతలను తిట్టడానికి వినియోగించే సమయాన్ని ఇసుక సమస్యను తీర్చడానికి వినియోగించాలని హితవు పలికారు.
‘జనసేన నాయకుడు ఇసుక లాంగ్ మార్చ్ చేస్తే ఆయనపై విమర్శలు చేస్తున్నారు.. వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. నేను అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తిగత విమర్శలు మీపై చేస్తే మీరు తట్టుకోగలుగుతారా? మీ కుటుంబం గురించి ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేస్తే తట్టుకోగలరా? అని ప్రశించారు. మమ్మల్ని తిట్టే సమయాన్ని ఉపయోగించుకొని ఇసుక సమస్య తీర్చండి, లేదంటే రాష్ట్రానికి క్షమాపణ చెప్పాల్సి అవసరం ఉంది’ అని అన్నారు.